
రక్తదానానికి ముందుకు రావాలి
మంచిర్యాలటౌన్: రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న బ్లడ్బ్యాంకులో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల పోలీసుశాఖ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడేందుకు, తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఎక్కించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఏఎస్ఐ జి.నందయ్య, రెడ్క్రాస్ సెక్రెటరీ చందూరి మహేందర్, డాక్టర్ శరత్బాబు, రెడ్క్రాస్ కోశాధికారి కె.సత్యపాల్రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, యెడ్ల కిషన్, కే.సంతోశ్కుమార్, ఎం.సత్యనారాయణరెడ్డి, చుంచు శంకర్వర్మ, బి.సత్యనారాయణరావు, రక్తనిధి వైద్యులు డాక్టర్ ప్రియాంక సక్సేనా, డాక్టర్ కే.సురేశ్, డాక్టర్ స్పందన పాల్గొన్నారు.