
క్షయ వ్యాధి నివారణ సులువు
బెల్లంపల్లి: క్షయ వ్యాధిని సత్వరంగా నిర్ధారించడం వల్ల నివారించడం తేలికవుతుందని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ రడగంబాలబస్తీలోని బస్తీ దవాఖానలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని తెలిపారు. అనంతరం శిబిరానికి హాజరైన ప్రజలకు పలు రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సహన, సుచరిత, సౌజన్య, రామకృష్ణ, జుబేర్ హుస్సెన్, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేందర్, క్లినికల్ సర్వీసు అధికారి రాజేష్, టీబీ సూపర్వైజర్ శశికాంత్ పాల్గొన్నారు.