
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: మంచిర్యాల, రవీంద్రఖని రైల్వేస్టేషన్ల మధ్య ఈ నెల 13న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (35) రైలు కిందపడి ఆత్మహ త్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్కా నిస్టేబుల్ సంపత్ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. రై లు కిందపడి ఒకరు చనిపోయిన ట్లు అందిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు, అడ్రస్ లభించలేదని తెలిపా రు. ఎడమ చేతిపై ‘ఇండియా’ అని ఇంగ్లిష్లో రాసిన పచ్చబొట్టు ఉంద ని, మృతుడి ఒంటిపై బ్లూకలర్ టీష ర్ట్, జీన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక ప్రభు త్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 9701112343, 8328512176 నంబర్లలో సంప్రదించాలని హెడ్కానిస్టేబుల్ సూచించారు.