‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’ | - | Sakshi
Sakshi News home page

‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’

Apr 24 2025 12:21 AM | Updated on Apr 24 2025 12:21 AM

‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’

‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’

లక్సెట్టిపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని బీజేపీ సీనియర్‌ నాయకులు వెర్రబెల్లి రఘునాఽథరావు అన్నారు. బుధవారం కొత్తూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టింగ్‌ పేరుతో బస్తాకు రెండు కిలోలు దోచుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్‌రెడ్డి, పురుషోత్తం, రమణారావు, ప్రభాకర్‌, గంగన్న, హరిగోపాల్‌, రాజగురువయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు.

బీజేపీలో పట్టభద్రుల చేరిక

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని దుగ్నెపల్లి, ఎర్ర గుంటపల్లి, ఆస్నాదకు చెందిన పట్టభద్రులు బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునాధరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, పార్టీ చెన్నూర్‌ పట్టణ ఇన్‌చార్జి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్‌, భీమారం మండల ఇన్‌చార్జి ఆలం బాపు, నాయకులు కొటారి వెంకటేశ్‌, సత్యం, దుర్గం రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement