
‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’
లక్సెట్టిపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు వెర్రబెల్లి రఘునాఽథరావు అన్నారు. బుధవారం కొత్తూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టింగ్ పేరుతో బస్తాకు రెండు కిలోలు దోచుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. ఎలాంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్రెడ్డి, పురుషోత్తం, రమణారావు, ప్రభాకర్, గంగన్న, హరిగోపాల్, రాజగురువయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు.
బీజేపీలో పట్టభద్రుల చేరిక
చెన్నూర్రూరల్: మండలంలోని దుగ్నెపల్లి, ఎర్ర గుంటపల్లి, ఆస్నాదకు చెందిన పట్టభద్రులు బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునాధరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పార్టీ చెన్నూర్ పట్టణ ఇన్చార్జి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, భీమారం మండల ఇన్చార్జి ఆలం బాపు, నాయకులు కొటారి వెంకటేశ్, సత్యం, దుర్గం రాజు పాల్గొన్నారు.