కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శ విజ్జు కృష్ణన్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఎల్లూరు గ్రామ సమీపంలోని పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టును అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి సందర్శించారు. పంపహౌజ్, ప్యానల్ బోర్డు, డెలివర్ పంపు పనులు పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులు, ప్రాజెక్టు పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ సాగర్, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, శ్రీనివాసుడు, కొల్లాపూర్ మండల సీపీఎం కార్యదర్శి శివవర్మ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్ డిమాండ్