
76 ఏళ్ల వయస్సులో యోగాసనాలు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రిటైర్డ్ లెక్చరర్ జి.పాండురంగం 76 ఏళ్ల వయస్సులో యోగాసనాలు చేస్తూ చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఉడిత్యాలకు చెందిన నరసింహారావు వద్ద యోగా నేర్చుకొని 1983 నుంచి ప్రతి రోజు యోగాసనాలు చేస్తున్నారు. వాకింగ్, యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ కొంతమంది మిత్రులతో కలిసి 1998లో జిల్లా కేంద్రంలో సుప్రభాత్ హెల్త్క్లబ్ ఏర్పాటు చేశారు. యోగాపై ఆసక్తితో పాండురంగం పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 2010లో హరిద్వార్లో ప్రత్యేక యోగా శిక్షణ తీసుకున్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సీనియర్ సిటిజన్లకు యోగా శిక్షణ అందిస్తున్నారు.