
బాలికపై బాలుడి అత్యాచారం
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
జడ్చర్ల: పక్కింట్లో ఉంటున్న అభంశుభం తెలియని బాలిక(10)పై బాలుడు(16) అత్యాచారం చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలో 5వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో పక్క ఇంట్లో ఉండే బాలుడు వారం రోజుల క్రితం ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు అనారోగ్యానికి గురైంది. అయితే బాలికతోపాటు తల్లి వెంటనే విషయం బయటకు చెప్పలేకపోయారు. రెండు రోజుల తర్వాత బాలిక ఆరోగ్యం విషమించడంతో 108లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు జడ్చర్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక సీఐ కమలాకర్ విచారణ చేపట్టారు. బాలికపై ఇంటి పక్కనే ఉన్న బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి జడ్చర్ల పోలీస్స్టేషన్కు చేరుకుని విచారించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని స్థానిక పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా.. బాలుడు ఇటీవలే పదో తరగతి పూర్తిచేశాడు.
చికిత్స పొందుతూతాపీమేస్త్రి మృతి
అయిజ: అనారోగ్యానికి చికిత్స పొందేందుకు ఆ ర్థిక ఇబ్బందులు.. కడుపులో నొప్పులు బరించలేక గడ్డిమందు తాగిన తాపీమేస్త్రి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన మండలంలోని యాపదిన్నెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లమ్మకు అయిజకు చెందిన కుమ్మరి రవి(35)తో ఎనిమి దేళ్ల కిందట వివాహమైంది. అత్తగారి గ్రామమై న యాపదిన్నెలో తాపీమేస్త్రి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కిడ్ని, లి వర్ సమస్యతో బాధపడుతూ డాక్టర్ల చుట్టూ తిరగడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఓ వైపు కడుపులో నొప్పులు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం గ్రామ సమీపంలోని వాగు వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కూలీలు కుటుంబ స భ్యులకు సమాచారం అందించగా.. గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు రెఫర్ చేశారు. చికిత్స పొందు తూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్ర వారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ స భ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతు డికి తండ్రి సాయిలన్న, భార్య ఎల్లమ్మ, ముగ్గు రు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెందడంతో ఎల్లమ్మ కుటుంబం రోడ్డున పడింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
భూతగాదాల్లో పలువురిపై కేసు నమోదు
నవాబ్పేట: మండల కేంద్రానికి చెందిన మల్తుంకార్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని 750 సర్వే నెంబర్లో మూడేళ్ల క్రితం శ్రీనివాస్ పొలం కొనుగోలు చేశాడు. ఆ భూమిలో వేసిన ఫెన్సింగ్ను గ్రామానికి చెందిన కారుకొండ రాజు, జంగయ్య, శ్రీశైలం, కేశవులు తొలగించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసునమోదు చేసినట్లు తెలిపారు.
కారుకొండలో..
మండలంలోని కారుకొండలో ఇద్దరు సోదరుల మధ్య భూవివాదంలో గొడవ చోటుచేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రం తెలిపారు. గ్రామానికి చెందిన బండారి పద్మమ్మ తన పేరున ఉన్న 4:30 గుంటల భూమిని ఇద్దరు కుమారులకు రెండెకరాల చొప్పున పట్టా చేయించింది. శుక్రవారం చిన్న కుమారుడు నరేశ్తోపాటు పొలంలో విత్తనాలు వేస్తుండగా.. పెద్ద కుమారుడు వెంకటేశ్ వచ్చి తనతోపాటు చిన్నకుమారుడిపై దాడిచేసి సాగుకు ఆటంకం కల్పించాడని బాధితురాలు పద్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంకటేశ్పై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.