
200 గ్రాముల గంజాయి స్వాధీనం
మహబూబ్నగర్ క్రైం: ఎకై ్సజ్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఎండు గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. సీఐ వీరారెడ్డి, ఎస్ఐ సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారు జామున పట్టణంలోని అప్పన్నపల్లి బ్రిడ్జి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో టీఎస్ 06ఈఈ 6393 నంబర్ కల్గిన బైక్పై ఆంజనేయులు, రాజ్కుమార్, రమేష్ 200 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితులు హైదరాబాద్లోని దూల్పేట్ ఏరియాలో ఎండు గంజాయి కొనుగోలు చేసి వస్తున్నట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు సీఐ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది కళానందం, బబ్బిష్రెడ్డి, రమేష్, అంజి, కృష్ణ, వినోద్, నాగరాజు పాల్గొన్నారు.
ముగ్గురు యువకుల రిమాండ్