
రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. నిజామాబాద్లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను గురువారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఫుట్బాల్లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్తో క్రీడల్లో ఉన్నత స్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, నందకిషోర్, శ్రీనివాస్, వాజిద్, నికేష్, రాజు, రాము, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.