ప్రకటనలు సరే.. వసతులేవి? | - | Sakshi
Sakshi News home page

ప్రకటనలు సరే.. వసతులేవి?

Jun 20 2025 6:33 AM | Updated on Jun 20 2025 6:33 AM

ప్రకట

ప్రకటనలు సరే.. వసతులేవి?

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రచార ఆర్భాటంగా మిగిలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా సర్కారు బడులు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇరుకైన తరగతి గదులు, చెట్లకింద పాఠాలు, అసంపూర్తిగా భవన నిర్మాణాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లోని అనేక బడుల్లో పైకప్పు సైతం సరిగ్గా లేని పరిస్థితి. గురువారం ‘సాక్షి’ బృందం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను విజిట్‌ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం 2023–24 విద్యా సంవత్సరంలో మన ఊరు–మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే 2024–25 విద్యాసంవత్సరంలో మరోసారి ప్రభుత్వం అమ్మ.. ఆదర్శ పాఠశాలలు పేరు మీద మరో పథకం తీసుకొచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో వసతులు సమకూర్చలేకపోయారు.

పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువు

మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదులు, వంటగదుల్లేక ఇబ్బందులు

శిథిలావస్థకు చేరిన పైకప్పులు

ఇంకా చెట్ల కింద సాగుతున్న చదువులు

అమ్మ ఆదర్శ పాఠశాలలు, మన ఊరు–మనబడిలో అరకొర పనులు

ప్రకటనలు సరే.. వసతులేవి?1
1/2

ప్రకటనలు సరే.. వసతులేవి?

ప్రకటనలు సరే.. వసతులేవి?2
2/2

ప్రకటనలు సరే.. వసతులేవి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement