
జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన
స్టేషన్ మహబూబ్నగర్: రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్అండ్బీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ దేశంలో కులమతాలకతీతంగా అందరినీ ఏకం చేయడానికి రాహుల్గాంధీ 4 వేల కిలోమీటర్లు భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. దేశంలో అందరికీ సమాన అవకాశాలు రావాలని రాహుల్గాంధీ కులగణన నినాదాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఆయన నిర్ణయం మేరకు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో చట్టం చేసినట్లు గుర్తు చేశారు. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపిస్తే బీజేపీ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో సమన్వాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు రాహుల్గాంధీ బర్త్డేకేక్ కట్ చేశారు. అనంతరం రెడ్క్రాస్ భవన్ ఆవరణలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, మిథున్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, ఎం.సురేందర్రెడ్డి, సీజే బెనహర్, ఆనంద్గౌడ్, జహీర్ అక్తర్, సిరాజ్ఖాద్రీ, అజ్మత్అలీ, వసంత, నవనీత, సాయిబాబా, ఫయాజ్, రాములుయాదవ్, గంజి ఆంజనేయులు, అవేజ్, తదతరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి
చట్టసభల్లో సమన్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం:ఎమ్మెల్యే యెన్నం
పాలమూరులో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ