ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి.. | - | Sakshi
Sakshi News home page

ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి..

Jun 20 2025 6:33 AM | Updated on Jun 20 2025 6:33 AM

ఆరు ద

ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి..

డ్చర్ల పాతబజార్‌లో ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఐదో తరగతి వరకు ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో మొత్తం ఆరు గదులు ఉండగా.. రెండు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మరో రెండు రేకుల గదులున్నాయి. వాటిలో ఒక గదిని విద్యార్థుల బ్యాగులు పెట్టుకోడానికి మాత్రమే వినియోగిస్తుంటారు. ఒక గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఉన్న రెండు సిమెంట్‌ స్లాబ్‌ గదులు సైతం శిథిలావస్థలో ఉన్నాయి. ఒక గది ఎప్పుడు పడిపోతుందో తెలియని స్థితిలో ఉండటంతో దానిని స్టోర్‌ రూంగా వినియోగిస్తున్నారు. మరో గదిలో మూడు తరగతులు కొనసాగిస్తున్నారు. వర్షం పడితే సిమెంట్‌ రేకుల రంధ్రాల నుంచి వర్షం కారుతుండడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించాల్సిన పరిస్థితి. ఇక కొత్తబజార్‌ ప్రాథమిక పాఠశాల పరిసరాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. కావేరమ్మపేట పాఠశాల గేటు తాళం విరగ్గొట్టి లోపల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. నల్లాలు విరగొట్టి.. పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు.

– జడ్చర్ల టౌన్‌

ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి.. 
1
1/2

ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి..

ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి.. 
2
2/2

ఆరు దశాబ్దాల పాఠశాల దుస్థితి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement