
పాలమూరుకు అందాలభామలు
ముస్తాబైన పిల్లలమర్రి
వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
మిస్ వరల్డ్–2025 పోటీదారుల పర్యటను సంబంధించి జిల్లా పోలీస్ శాఖ 1,008 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి వరుసలో మహిళ పోలీస్ సిబ్బంది విత్ సఫారీలో ఉండగా, రెండో వరుసలో సివిల్ పోలీస్, మూడో వరుసలో ఏఆర్ పోలీస్ బలగాలను బందోబస్తు కోసం కేటాయించనున్నారు. వీరితో పాటు స్పెషల్ పార్టీ, రాష్ట్రస్థాయి నుంచి బలగాలు పహారా కాస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ల నుంచి పోలీస్ బలగాలను రప్పించారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 936 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. బందోబస్తును మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించనున్నారు.

పాలమూరుకు అందాలభామలు