మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–2026 విద్యాసంవత్సరం పదో తరగతి ఫలి తాల్లో 67 మంది విద్యార్థులకు గాను 66 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా 558 మార్కులు సాధించి విద్యార్థిని ఏనుగ ఇందు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. ముగ్గురు విద్యార్థులు సౌశీల్ రెడ్డి, లక్ష్మిప్రసన్న, ప్రసన్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ టెస్టు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి జరుగుతుండగా పీఎంశ్రీ పథకం ద్వారా విద్యార్థుల అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు.


