తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి. పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠ్యపుస్తకాలు, యూనిపామ్, నోట్ బుక్స్, పాఠశాలలకు పంపిస్తున్నాం. ఈ నెల 19వరకు బడి బాట కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను చేర్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
–ఏ. సత్యనారాయణమూర్తి, డీఈఓ


