లక్ష్యాలు పూర్తి చేయడంలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాలు పూర్తి చేయడంలో ముందుండాలి

Jun 19 2025 4:36 AM | Updated on Jun 19 2025 4:36 AM

లక్ష్యాలు పూర్తి చేయడంలో ముందుండాలి

లక్ష్యాలు పూర్తి చేయడంలో ముందుండాలి

బయ్యారం: ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం ముందుండాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. బుధవారం మండంలోని కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక అధికారులు రోజు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలన్నారు. ము న్సిపల్‌, గ్రామ పంచాయతీల్లో సంబంధిత అధి కారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉన్న మహిళలకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుక తదితర సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

గార్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ఆదేశించారు. బుధవారం మండలంలోని సీతంపేట, పోచారం పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల మార్కింగ్‌లను ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి ఇళ్లు షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మంగమ్మ, పంచాయతీ కార్యదర్శులు అభిలాష్‌, రమేశ్‌, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement