బయ్యారం: బయ్యారం పెద్దచెరువుతో పాటు కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్ మండలాలకు గోదావరి జలాలు అందించాలని ఎంపీ బలరాంనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవించారు. బుధవారం హైదరాబాద్లో వారు సీఎంను కలిసి గోదావరి జలాలను సాగు భూములకు అందించాలని కోరారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించి త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నట్లు వారు విలేకరులకు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినా రాయణ, రాందాస్ తదితరులు ఉన్నారు.