వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Apr 24 2025 1:54 AM | Updated on Apr 24 2025 1:54 AM

వాతావరణం

వాతావరణం

ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.

మహిళా సాధికారతే లక్ష్యం

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

కొత్తగూడ: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్‌, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో సీ్త్ర శక్తి క్యాంటీన్‌ను ప్రారంభిచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. అదే బస్సులకు మహిళలను ఓనర్లుగా చేస్తూ కొత్తగూడ మండల సమాఖ్యకు బస్సును కేటాయించినట్లు తెలిపారు. సీ్త్ర శక్తి క్యాంటీన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి..

కశ్మీర్‌ ప్రాంతంలో పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. కుల, మత ప్రాతిపదికన హత్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. రాజకీయంగా మాట్లాడటం కన్నా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

29న రాజ్యాంగ రక్షణ సభ

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని వీఆర్‌ఎన్‌ గార్డెన్‌లో ఈ నెల 29న ఉదయం 10గంటలకు రాజ్యాంగ రక్షణ సభ నిర్వహిస్తున్నామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, జిల్లా చైర్మన్‌ డోలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ఉద్యమకారులు, ప్రజా, కుల సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రాజ్యాంగ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాగం రక్షణ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ హాజరవుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement