
పుష్కరాల పనుల్లో వేగం పెరగడం లేదు
కాళేశ్వరం: ఆశించిన స్థాయిలో పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెరగడం లేదని, పనులను అధికారులు, కాంట్రాక్టర్లు సీరియస్గా తీసుకోవాలని దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. బుధవారం సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరంలో పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించారు. వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద పుష్కర ఘాట్ విస్తరణ పనులు చూశారు. గోదావరి నీటిమట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. గోదావరి వద్ద భక్తుల కోసం చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, 86 గదుల గెస్ట్హౌస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని మూడు గంటల పాటు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న పది రోజులు చాలా ముఖ్యమని, ప్రతి రోజూ పనుల్లో ప్రగతి రావాలన్నారు. పనుల వివరాలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు. మే 10వ తేదీ వరకు అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్న కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణ రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్నాయక్,ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, డీపీఓ నారాయణరావు, ఈఓ మహేశ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఈఈ కనక దుర్గాప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూ ఎస్ఈఈ నిర్మల, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
పనులు సీరియస్గా చేయండి
దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజారామయ్యర్
క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన
మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష