ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించాం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించాం

Apr 24 2025 1:50 AM | Updated on Apr 24 2025 1:50 AM

ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించాం

ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించాం

హసన్‌పర్తి: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి అన్నారు. సీనియర్‌, జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతోపాటు ఐఐటీ, జేఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుధవారం 55వ డివిజన్‌ కోమటిపల్లిలోని ఆల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్‌ విద్యాసంస్థలకు దీటుగా ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థలు తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నాయన్నారు. సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో కళాశాలకు చెందిన జె. అంజనా 997 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఎంపీసీ విభాగంలో కె. రుత్విక్‌ 996 మార్కులు, సేవితా 994 మార్కులు, కీర్తన 994 మార్కులు, జి.వర్షిణి 993 మార్కులు, సాత్విక 992 మార్కులు, పల్లవి 992 మార్కులు, గాయత్రేణి 992 మార్కులు, కె. హాసిని 992 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో జి. తరుణ్‌ 468 మార్కులు, ఎ.నిచిత 468 మార్కులు, కె. సహస్ర 467 మార్కులు, శ్రీవర్షిణి 467 మార్కులు, పి.సిరిచందన 467 మార్కులు, దేషిమి 467 మార్కులు, కె.వర్షిత 467 మార్కులు, సాత్విక 467 మార్కులు, కె. శ్రీకాంత్‌ 467 మార్కులు, బన్ని 467 మార్కులు, ఎ.ధీరజ్‌ 467 మార్కులు, కె. గీతాంనిహారి 467 మార్కులు, హాసిని 467 మార్కులు, సాయినాథ్‌ 466 మార్కులు, బైపీసీ విభాగంలో తారీమ్‌ 438 మార్కులు, సామఫి రాధోస్‌ 438 మార్కులు, హాసిని 437 మార్కులు, మస్విని 436 మార్కులు సాధించారని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌

నరేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement