
తాగునీరు రావడం లేదని రాస్తారోకో
నెల్లికుదురు: వారం రోజుల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులతో మొరపెట్టుకున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయడం లేదని సీపీఎం మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లాని పాపారావు, బీఆర్ఎస్ నాయకుడు బైస రమేశ్ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో 10రోజుల నుంచి తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సోమవారం రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో మంచినీటి కొరత లేదని ఎంపీఓ పద్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.