
అఽధిక ధరలను నియంత్రించాలి
మహబూబాబాద్: అధిక ధరలను వెంటనే నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. ధరలు పెరగడంతో పేదలపై తీవ్రభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం మోదీ కేవలం కార్పొరేట్లకే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్ సారథిరెడ్డి, శ్రీనివాస్, ఇక్బాల్, ఫరీద్ రియాజ్, చాంద్, పెరుగు కుమార్, నవీన్ పాల్గొన్నారు.