
ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలి
గార్ల: సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీటిని ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు అందించాలని కోరుతూ సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈధర్నాను ఉద్దేశించి న్యూడెమోక్రసీ పార్టీ మండల కార్యదర్శి జి.సక్రు మాట్లాడారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీరామ్కు అందజేశారు. కార్యక్రమంలో మాన్యా, సీహెచ్ గణేశ్, రైతులు పాల్గొన్నారు.