మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌

Apr 22 2025 1:15 AM | Updated on Apr 22 2025 1:15 AM

మోకు

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌

తొర్రూరు రూరల్‌: గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన మేరుగు మల్లేశంగౌడ్‌ను నియమిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్‌ అనంతుల రమేశ్‌గౌడ్‌ నియామక పత్రాన్ని సోమవారం అందించారు.

స్థానిక సంస్థల

ఎన్నికల్లో సత్తా చాటాలి

గూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా నాయకుడు పొదిళ్ల నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2029ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందన్న నమ్మకాన్ని ఇప్పటి నుంచే కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాసమల్ల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ నాయిని ధర్మారెడ్డి, ఎంపీపీ చెల్పూరు వెంకన్న, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు రాంబాబు, శ్రీశైలం, విజయశ్రీ, నాగేశ్వర్‌రావు, పడాల నాగరాజు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

మహబూబాబాద్‌: మానుకోట మండలంలోని కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1988–89 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన అక్బర్‌ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తోటి మిత్రులు సోమవారం రూ.37,500 ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో మిత్రులు నూకల సుధీర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, భీముడు వెంకటప్పయ్య, జయపాల్‌, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణకు కేంద్రం కుట్ర

మహబూబాబాద్‌ అర్బన్‌: వక్ఫ్‌ ఆస్తులు అక్రమణకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జేఏసీ ఉద్యమ నేత చైర్మన్‌ డాక్టర్‌ డోలి సత్యనారాయణ అన్నారు. వక్ఫ్‌ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీల ధరించి ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమ, వామపక్ష, కుల, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్‌ జాయిట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్‌ సాహెబ్‌, ఫజల్‌, ఇబ్రహిం, రహీం, జాకీర్‌, నజీర్‌, జావీద్‌, నయీమ్‌, షకిల్‌, సత్తార్‌, యూసఫ్‌ పాల్గొన్నారు.

పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

పెద్దవంగర: పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు వహించాలని మండల పశువైద్యాధికారి రాజశేఖర్‌ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కేతిరెడ్డి సోమనర్సింహరెడ్డి, సిబ్బంది సంధ్య, అనిల్‌, హసన్‌, ఉప్పలయ్య పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థి విరాళం

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్ధి శేరి వీరయ్య పాఠశాల అభివృద్ధి కోసం రూ.20వేలు సోమవారం విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గుగులోత్‌ లక్ష్మి, ఉపాధ్యాయులు రవి, రాధిక, సువర్ణ, కవిత, శ్రీజ పాల్గొన్నారు.

ఫ్రీజర్‌ బాక్స్‌ అందజేత

దంతాలపల్లి: మండల కేంద్రానికి చెందిన సేను రాజేష్‌ తన భార్య మహేశ్వరి జ్ఞాపకార్థం, నెల్లూరి యాకయ్య తన తండ్రి నారాయణ జ్ఞాపకార్థం చెరో రూ.36వేల చొప్పున రూ.73వేల విలువ చేసే ఫ్రీజర్‌ను గ్రామ పంచాయతీ కార్యలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకన్న, ఎస్సై పిల్లల రాజు, నాయిని శ్రీనివాస్‌ రెడ్డి, సంపెట సురేష్‌, యాకయ్య పాల్గొన్నారు.

నార్మల్‌ డెలివరీతో ఆరోగ్యం

గార్ల: నార్మల్‌ డెలివరీలతోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని గార్ల సీహెచ్‌సీ డాక్టర్‌ హనుమంతరావు అన్నారు. సోమవారం స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రిలో ఎస్‌.స్వప్నకు నార్మల్‌ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కార్యక్రమంలో హెడ్‌ స్టాఫ్‌నర్సు స్వాతి, స్టాఫ్‌నర్సులు రమాదేవి, నాగమణి, పుష్పలత, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌ 
1
1/3

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌ 
2
2/3

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌ 
3
3/3

మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement