
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
వేలేరు: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని సీనియర్ శాస్త్రవేత్త రాజశేఖర్ రెడ్డి,కేఎన్ బయోసైన్స్ ఎండీ సుధారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లసాగర్లో కేఎన్ బ యో సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తో టలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. వేసవిలో సరిపడ నీరు లేకపోతే మొక్కల్లో వచ్చే లోపాలు, వాటి యాజమాన్య పద్ధతులను వివరించారు. ఆయిల్పామ్ సాగులో సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు. ప్రభుత్వం ఆయి ల్ పామ్ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాకాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ డైరక్టర్ కుషాల్ రెడ్డి, జిల్లా మేనేజర్ రంజిత్, ఫీల్డ్ ఆఫీసర్లు విక్రమ్, మహిపాల్ పాల్గొన్నారు.