స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష

Apr 20 2025 1:00 AM | Updated on Apr 20 2025 1:00 AM

స్వచ్

స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష

ధికారుల నిర్లక్ష్యంతో రుద్రవరం జెడ్పీ స్కూల్‌ పిల్లలు అవస్థలు పడ్డారు. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల వరకు శనివారం భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించాలని భావించారు. కార్యక్రమానికి కూటమి నేతలు, అధికారులు వస్తారని మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. ఎవరూ రాకపోవడంతో మండల పరిషత్‌ అధికారులు తమ కార్యాలయానికి ఎదురుగా ఉన్న జెడ్పీ పాఠశాల నుంచి విద్యార్థులను పిలిపించారు. ప్రధాన రహదారి మీదుగా అమ్మవారిశాల సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహరం చేపట్టారు. అయితే ఎండకు పాదరక్షలు లేని విద్యార్థులు కాళ్లు కాలి విలవిలలాడారు. ఎండలో నిలబడలేక నీరసించిపోయారు. ఎండలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

– రుద్రవరం

స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష 1
1/1

స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement