ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

● వంతుల వారీ విధానంలో బంటుమిల్లి మెయిన్‌ కాలువకు కనీసం పది రోజుల పాటు సాగునీరు అందించి వరి పంటను కాపాడాలని, చోరంపూడి కాలువపై డ్రాప్‌ నిర్మాణం చేయాలని, విచక్షణా రహితంగా, అడ్డగోలుగా తవ్విన వడ్ల గరువు కాలువను భౌతికంగా పరిశీలన చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ● తాను పుట్టుకతో అంగవైకల్యంతో ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తన భర్త అనారోగ్యంతో కూలి పనులు చేయలేకపోతున్నందున కుటుంబ పోషణ కష్టంగా మారిందని, గన్నవరం రైతుబజారులో కూరగాయల షాపు మంజూరు చేసి జీవనోపాధి కల్పించాలని గన్నవరం గ్రామానికి చెందిన దివ్యాంగ మహిళ తిరువీధి తబిత కలెక్టర్‌కు అర్జీ ఇచ్చింది.

పీజీఆర్‌ఎస్‌లో 118 అర్జీల స్వీకరణ కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్‌ఎస్‌) జరిగింది. కలెక్టర్‌తో పాటు డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీఎస్పీ ఆర్‌.అభిషేక్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిష్కరించటంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో అధికారులు మొత్తం 118 అర్జీలను స్వీకరించారు.

ముఖ్యమైన అర్జీలు ఇవీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement