సెల్ ఫోన్ను ఎక్కువ సేపు చూసినా, మాట్లాడినా అనారోగ్యమే శారీరక, మానసిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్న వైద్యులు
ప్రభుత్వ ఉద్యోగం చేసే మహేష్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఫోన్ చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎదైనా కాల్ వస్తే కంగారు పడుతుంటాడు. ఒక రోజు తీవ్రమైన తలనొప్పితో కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్తపోటు 160/90 ఉంది. అతని వయస్సు 35 సంవత్సరాలే. ఫోన్ చూసే సమయంలో ఒత్తిడి వల్ల చిన్నవయసులోనే రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తేల్చారు. ఇలా వీరిద్దరే కాదు నిత్యం వేలాది మంది ఫోన్లు చూస్తూ, మాట్లాడుతూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వారిలో బీపీ అదుపుతప్పుతోంది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. గడిచిన సమయంలో ఒక్క సెకను కూడా తిరిగిరాదు. నేడు విద్యార్థులు, యువత, పెద్దలు, ఉద్యోగులు ఇలా ఒక్కరేంటి అందరూ ఎక్కువ సేపు సెల్ఫోన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇలా తమకు తెలియకుండానే జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతే కాదు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగ్గుతున్న అన్యోన్యత
స్మార్ట్ ఫోన్ల దెబ్బకి మనుషుల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్లు, టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు, భార్యాభర్తలు ఇద్దరూ చేరోవైపు కూర్చుని ఖాళీ దొరికితే చాలు ఫోన్ తీసుకుని రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య అన్యోన్యత దెబ్బతింటోందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మానసిక సమస్యలు ఇలా..
అనారోగ్య సమస్యలు ఇలా.. ..


