విజేఈఈభవ! | - | Sakshi
Sakshi News home page

విజేఈఈభవ!

Jan 20 2026 8:25 AM | Updated on Jan 20 2026 8:25 AM

విజేఈఈభవ!

విజేఈఈభవ!

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. పరీక్ష కేంద్రాలు ఇవి.. కఠిన నిబంధనలు.. ● జేఈఈ మెయిన్స్‌కు సంబంధించిన అడ్మిట్‌కార్డులు పొందిన విద్యార్థులు ఎన్‌టీఏ పొందుపరిచిన నియమ నిబంధనలను పూర్తిగా చదవాలి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ● ఎన్‌టీఏ జేఈఈ మెయిన్స్‌కు సంబంధించి పరీక్షకు నీట్‌ తరహాలో కఠినంగా నియమాలను అమలు చేయనుంది. అందులో భాగంగా పరీక్షకు హజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులను ధరించాలని నిబంధనలు విధించింది. ● విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డోన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్స్‌లో కలర్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను అతికించాల్సి ఉంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉంటుంది. ● విద్యార్థి తమ వెంట అడ్మిట్‌కార్డుతో పాటుగా అటెండెన్స్‌ షీట్‌పై అతికించేందుకు మరొక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను వెంట తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌తో పాటుగా బ్లాక్‌ కలర్‌ బాల్‌పాయింట్‌ పెన్నును తెచ్చుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఆధార్‌, పాన్‌ తదితర ఒరిజినల్‌ కార్డులను విధిగా తీసుకెళ్లాలి.

రేపటి నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్ష

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉమ్మడి జిల్లాలో ఐదు కేంద్రాల్లో రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష రాసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా విద్యార్థులు వారి అడ్మిట్‌ కార్డులో ఉన్న నియమనిబంధనలు ఒకటికి రెండు సార్లు చదువుకోవటం మంచిది. పది మంది పరిశీలకులు పరీక్షను పర్యవేక్షిస్తారు.

– జి. బర్నబాస్‌, పరీక్షల సమన్వయకర్త

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ –2026కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ కావటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గొల్లపూడికి చెందిన లైఫ్‌బ్రిడ్జి ఇన్ఫో టెక్నాలజీస్‌ (వాసవీ ఫార్మా మార్కెట్‌ కాంప్లెక్స్‌), గవర్నర్‌పేట రామమందిరం రోడ్డులోని ఎస్‌వీటీ ఇన్ఫోటెక్‌, కండ్రికలోని ఐకాన్‌ డిజిటల్‌ జోన్‌ ఐడీజెడ్‌, కానూరు డొంకరోడ్డులోని శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్‌, కానూరు గ్రామంలోని ఐకాన్‌ డిజిటల్‌ జోన్‌ ఐడీజెడ్‌ పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పరీక్షకు సుమారుగా 30 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్ష జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement