ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు
కోనేరుసెంటర్: ప్రజా సమస్యలను పరిష్కరించటంలో రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను సామరస్యంగా ఆలకించటంతో పాటు అఽధైర్యపడొద్దు... మీకు మేమున్నామంటూ ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే తక్షణమే తన నోటీసులో పెట్టాలని సూచించారు. సమస్య ఎలాంటిదైనా బాధితుల తరఫున పోలీసులు ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఆ దిశగా మనమంతా పని చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించినా బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిసినా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో మొత్తం 25 అర్జీలు అందినట్లు తెలిపారు.
ప్రధానమైన అర్జీలు ఇవే...
మీకోసంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు


