ఆగిన ఫాస్టాగ్..
కీసర(కంచికచర్ల): కంచికచర్ల మండలం కీసర స్వర్ణ టోల్ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు బారులుదీరాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్లే వాహనాలన్నీ ప్లాజా వద్ద కొంతసేపు ఆగాయి. ఫాస్టాగ్ సిస్టం రెండు లైయిన్ల వద్ద కొంత ఆలస్యం కావటంతో వాహనాలు బారులుదీరాయి. అనంతరం అంతా సజావుగా సాగింది. టోల్ప్లాజా వద్ద వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని.. వారి ప్రయాణానికి ఆటంకం కలుగకుండా ఐదు ఫాస్టాగ్ లైన్లను ఏర్పాటు చేసినట్లు ప్లాజా మేనేజర్ జయ ప్రకాష్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.


