
లెవల్ నిర్వహిస్తేనే..
కోమటిగుంట లాకులు వద్ద లాకులు బిగించి ఏడు అడుగులు నీటి మట్టం నిర్వహించాలి. అప్పుడే రెగ్యులేటర్కు ఎగువన ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. పంట కాలువల షట్టర్లు తెరచుకోవటంతో పాటుగా తూములు ద్వారా పంట కాలువల్లోకీ నీరు మళ్లుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం ఆరు అడుగులు మాత్రమే ఉంది. దీంతో రెగ్యులేటర్కు ఎగువన ఉన్న పంట కాలువలకు నీరు ఎక్కక, సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడు అడుగులు లెవల్ నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో నాట్లకు సిద్ధమవుతున్న నారుమడులు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు.