మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

● కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కె.హరిత అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ఈ ఏడాది 3 గంజాయి కేసులు నమోదు, గంజాయి సాగు చేసిన 36 మంది రైతులకు రైతుబంధు నిలిపివేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు లోకేశ్వర్‌ రావు, కిష్టయ్య, డీఎస్పీ అశోక్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

ఆసిఫాబాద్‌: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ వినయ్‌ కుమార్‌, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల హాజరుశాతం పెంచాలని కలెక్టర్‌ కె.హరిత అ న్నారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారితో కలిసి జిల్లాలోని ఎంఈవో, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, సీఆర్‌పీలకు జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు.

విముక్తి జాతుల అభివృద్ధికి చర్యలు

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని విముక్తి జాతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయడంతో పాటు పిల్ల లకు విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నదీమ్‌, గిరిజన సంక్షేమాధికారి అంబాజి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement