
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలతో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డెన్ ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ సమాజ సేవతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించే సేవలు గొప్పవన్నారు. పాఠశాల స్థాయి నుంచే స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపు, స్వయంకృషితో ఎదగడం, శారీర క, మానసిక దృఢత్వానికి దోహదపడుతాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయన్నారు. ఈ సందర్భంగా జా తీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న విద్యార్థులను అభినందించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రూ పొందించిన గుడారం, నివాస సమూహాల నమూనాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందించారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులంతా ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించాలని, దీనిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో ప్రశాంత్, హెచ్ఎం రవితేజ, ఉపాధ్యాయులు ఆర్లారెడ్డి, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.