
సెలవుల్లో సమ్మర్ క్యాంపులు
● మే 1 నుంచి 31 వరకు క్రీడాశిబిరాలు ● యువజన శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో మానసికోల్లాసం, దేహదారుఢ్యం పెంపొందించేందుకు గ్రామస్థాయిలో ఈ క్రీడా శిక్షణ శిబిరాలు దోహదపడనున్నాయి. విద్యార్థులకు పది రకాల క్రీడల్లో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలబాలికలు తమకు నచ్చిన ఆటలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ అందించేందుకు పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 25 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఐదు మండలాల్లో శిబిరాలు
జిల్లాలోని ఆసిఫాబాద్, రెబ్బెన, కెరమెరి, కాగజ్నగ ర్, తిర్యాణి మండలాల్లో క్రీడా శిక్షణ శిబిరాలు ఏ ర్పాటు చేయనున్నారు. పది క్రీడల కోసం పది మంది శిక్షకులను ఎంపిక చేయనున్నారు. మే 1 నుంచి 31 వరకు సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయి. శిక్షణకు సంబంధించిన క్రీడా సామగ్రిని సైతం అధికారులే పంపిణీ చేస్తారు. అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, నెట్బాల్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, సాఫ్ట్బాల్, యోగా, ఫుట్బాల్, షూటింగ్ బాల్ క్రీడల్లో శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చాలాప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఎండలు ఎక్కువ ఉండటంతో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది. ఒక్కో శిక్షణ శిబిరంలో 40 నుంచి 50 మంది వరకు పిల్లలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. కోచ్లకు రూ.4000 వేతనం ఇవ్వనున్నారు.
త్వరలో బడులకు సెలవులు
ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ముగి శాయి. ప్రోగ్రెస్ కార్డులు అందించిన తర్వాత ఈ నెల 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రా రంభం కానున్నాయి. వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేసుకోకుండా క్రీడాశిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆటల వైపు మళ్లిస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని చెబుతున్నారు. అలాగే చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉంటారు. కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శి బిరాలు నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. వ చ్చే నెల 1 నుంచి 31 నిర్వహించే సమ్మర్ క్యాంపులను స ద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పి ల్లలను శిబిరాలకు పంపించాలి. దాగి ఉన్న క్రీడానైపుణ్యం వెలికి తీసేందుకు ఉపయోగపడతాయి.
– రమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి

సెలవుల్లో సమ్మర్ క్యాంపులు