
ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు!
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మండలం గో వింద్పూర్ శివారుల్లోని సర్వే నం.83లోని కేశవనాథ స్వామి ఆలయ భూముల్లో అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో బుధవారం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఇటీవల ఆలయ భూములకు వేలం నిర్వహించేందుకు తేదీని ప్రకటించారు. గోవింద్పూర్లో వేలానికి సంబంధించిన పోస్టర్ అంటించేందుకు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి వేణుగోపాల్ గుప్తా, బాపిరెడ్డి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రవికిషన్, అటెండర్ రాజేశ్వర్, అలయ అర్చకుడు నరేశ్శర్మ, కమిటీ సభ్యులు మనోజ్కుమార్, సుగుణాకర్ వెళ్లారు. ఆల యం భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న వారిని ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. నిర్మాణాలను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.