
పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన
ఆసిఫాబాద్రూరల్: బీసీ వసతిగృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకుడు బ్రహ్మనందం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీ వసతిగృహాల్లో ఔట్సో ర్సింగ్ వర్కర్లకు 12 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతినెలా నిత్యావసర వస్తువులు, అత్యవసర ఖర్చులకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. రూ.13,600 నెలసరి జీతంతో బతుకుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ప్రతినెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ స్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు పిలుపుని స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జగజంపుల తిరుపతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమురయ్య, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్ష్మి, శారద, పార్వతి, శకుంతల, పోషక్క, సరోజ, జ్యోతి, సుజాత పాల్గొన్నారు.