ఆసిఫాబాద్అర్బన్: సఖి కేంద్రానికి వచ్చే బాధితుల కు సత్వర సహాయం అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురా లు ఈశ్వరీబాయి అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశా రు. రిజిస్టర్లు పరిశీలించి, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మా ట్లాడుతూ సఖి కేంద్రం ద్వారా అందుతున్న సేవల పై ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలన్నా రు. బాధిత మహిళల రక్షణ, వారి సమస్యల పరి ష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉండాలన్నా రు. అనంతరం సిబ్బందిని ఈశ్వరీబాయిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, సిబ్బంది మమత, సుమలత, రమేశ్, సత్యశీల తదితరులు పాల్గొన్నారు.