దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్అర్బన్: క్రిస్మస్ సంబురాల్లో భా గంగా సామాజిక, విద్య, వైద్యం, సాహిత్యం, కళారంగం, ఇతర రంగాల్లో ఉత్తమ సేవలు, ప్రతిభ చూపిన క్రైస్తవులను ప్రభుత్వం తరఫున సత్కరించేందుకు అర్హులైన వారిని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లకు పైగా సేవ, ప్రతిభ చూపి న వ్యక్తులు, 30 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న సంస్థల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను జిల్లా మై నార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం నుంచి లేదా www. tscmfc. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 16 సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని, మరిన్ని వివరాలకు 85007 23745 నంబర్లో సంప్రదించాలని కోరారు.
ఇన్చార్జి జెడ్పీ చైర్మన్ ఎంపిక సరికాదు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
కాగజ్నగర్టౌన్: ఇన్చార్జి జెడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు ఎంపిక సరికాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం జనాభా ప్రాతిపదికన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ (మహిళ)కు రిజర్వ్ చేశారని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగిన కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ(మహిళ)కు రిజర్వ్ చేసిన చైర్పర్సన్ పదవికి జనరల్ కేటగిరీకి చెందిన ప్రస్తుత జిల్లా వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావును ఎంపిక చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు. ఆదివాసీలకు దక్కిన రాజ్యాంగ హక్కులను ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించి మరో ఎస్టీ (మహిళ)ను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజ్యాంగ బద్ధంగా చట్టప్రకారం ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు.