
ఇంటి నుంచే నీళ్లు..
లింగాపూర్: మండలంలోని పిక్లాతండా గ్రామంలో గల గిరిజన సంక్షేమ పాఠశాలలో 80 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తులు ఒకేతాటిపై ఉండి పిల్లలను ప్రైవేట్కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. అయితే నలుగురు టీచర్లు ఉండాల్సిన చోట.. కేవలం ఇద్దరు సీఆర్టీలు మాత్రమే పనిచేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రూ.5.45లక్షలు మంజూరు చేసినా మరమ్మతులు సక్రమంగా చేపట్టలేదు. తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లలు ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు.