ఏళ్లుగా మూతబడి.. | - | Sakshi
Sakshi News home page

ఏళ్లుగా మూతబడి..

Jun 20 2025 6:03 AM | Updated on Jun 20 2025 6:03 AM

ఏళ్లుగా మూతబడి..

ఏళ్లుగా మూతబడి..

చింతలమానెపల్లి: మండలంలోని బాలాజీ అనుకోడ పాఠశాల మూతబడింది. స్థానికులు ఆటోపార్కింగ్‌, పశువుల కోసం వినియోగిస్తున్నారు. ఆవరణలో ఏకంగా ఒక నర్సరీ నిర్వహిస్తున్నారు. రవీంద్రనగర్‌ 2 పాఠశాలకు గతేడాది నుంచి విద్యార్థులు హాజరు కావడం లేదు. గదుల్లో పలువురు ఆటవిడుపుగా పేకాట ప్రారంభించారు. మండల కేంద్రంలోని దుబ్బగూడ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి. తరగతి గదుల్లో ఒకటి ఎంఈవో కార్యాలయంగా, మరొకటి ఈఆర్‌పీ నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఐదు తరగతులను రెండు గదుల్లో నిర్వహిస్తున్నారు. బాబాసాగర్‌ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement