
తాత్కాలిక షెడ్డులో గిరిజన పాఠశాల
తిర్యాణి(ఆసిఫాబాద్): మంగీ పంచాయతీ పరిధిలోని కుంటగూడ గ్రామంలో గల గిరిజన ప్రాథమిక పాఠశాలల తాత్కాలిక షెడ్డులో కొనసాగుతోంది. పక్కా భవనం కోసం పదేళ్ల క్రితం నిధులు మంజూరు చేయగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయులు కొన్నేళ్లపాటు గ్రామ పటేళ్ల ఇంటి వద్ద తరగతులు నిర్వహించారు. మూడేళ్ల క్రితం స్వచ్ఛంద సంస్థ సహకారంతో తాత్కాలిక షెడ్డు నిర్మించారు. ప్రస్తుతం తడకలు కట్టిన ఆ షెడ్డులోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలలో 1 నుంచి 3వ తరగతి వరకు 13 మంది పిల్లలు ఉన్నారు.