
సమస్యల్లో సర్కారు బడి
● తరగతి గదుల కొరతతో ఒకేచోట పాఠాలు ● పక్కా భవనాలు లేక విద్యార్థుల అవస్థలు ● అధ్వానంగా మారిన ఆశ్రమ పాఠశాలలు ● తాత్కాలిక షెడ్లలోనే కొనసాగుతున్న తరగతులు
ఆసిఫాబాద్రూరల్: సర్కారు బడులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ చాలాచోట్ల మరమ్మతులు పూర్తికా లేదు. సరిపడా గదులు లేకపోవడంతో కొన్నిచోట్ల వివిధ తరగతుల విద్యార్థులకు ఒకేచోట బోధిస్తున్నారు. జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలకు ఇప్పటికీ పక్కా భవనాలు లేక షెడ్లు, తాత్కాలిక భవనాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేయగా, అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో లోకల్బాడీ పాఠశాలలు 739 ఉండగా, మోడల్ స్కూళ్లు 2, కేజీబీవీలు 15, ఒక అర్బన్ స్కూ ల్ ఉంది. వీటిల్లో సుమారు 36 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 374 ఆశ్రమ పాఠశాలలు ఉండగా, ఆయా స్కూళ్లలో 14,739 మంది విద్యనభ్యసిస్తున్నారు.
తడకలు, రేకులతో వేసిన షెడ్డులో చదువుకుంటున్న బెల్గాం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలు
లోకల్బాడీ స్కూళ్లు
ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మొత్తం
561 101 77 739
ఆశ్రమ స్కూళ్లు
333 3 38 374

సమస్యల్లో సర్కారు బడి