గోకులరామంలో రామయ్య ‘విలాసం’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పగల్ పత్తు, రాపత్తు సేవలు పూర్తయ్యాక స్వామికి వివిధ ప్రాంతాల్లో మూడు రోజులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొలిరోజు శనివారం ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న గోకుల రామంలో నేత్రపర్వంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ వేడుకగా గోకులరామం వేదికపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, హారతి సమర్పించారు.
మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన..
అంతరాలయంలోని మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ, సేవా కాలం, ఆరాధన చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు.
వైభవోపేతంగా ప్రారంభమైన
విలాసోత్సవాలు


