
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డీఎంఈ బృందం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడి మూడేళ్లు పూర్తవగా డీఎంఈ డాక్టర్ నరేందర్ కుమార్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసింది. గతంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యాన కళాశాలలను ఆన్లైన్ విధానంలో పరిశీలించి నిర్వహణపై సూచనలు చేసేవారు. కానీ ఇటీవల అనుమతుల విషయంలో అభ్యంతరాలు వస్తుండడంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుల నేతృత్వాన ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఎంసీ నేతృత్వాన బృందం కళాశాల, జిల్లా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించింది. తరగతి గదులు, ల్యాబ్లు, అధ్యాపకుల వివరాలు ఆరా తీశాక అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధ్యక్షతన అధికారులతో సమావేశమయ్యారు. కాలేజీలో కల్పించాల్సిన మరిన్ని వసతులపై సూచనలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వర్రావు, వైస్ప్రిన్సిపాల్ సృజన, డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వసతులు, బోధన సౌకర్యాలపై ఆరా