జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు | - | Sakshi
Sakshi News home page

జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు

Jun 27 2025 4:51 AM | Updated on Jun 27 2025 4:51 AM

జమలాప

జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆల య హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. దేవాదాయ శాఖ పరిశీలకుడు ఎం.అనిల్‌కుమార్‌, ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు సమక్షాన లెక్కింపు చేపట్టగా 95రోజులకు గాను రూ.41,23,546 ఆదాయం నమోదైంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్ప ల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్‌ ఎస్‌.విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మతో పాటు శ్రీసత్యసాయి సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

రైసెట్‌లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఖమ్మంరూరల్‌: రూరల్‌ మండలంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో ఉన్న తరుణి హాట్‌లోని రైసెట్‌ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ తెలిపారు. మహిళలకు టైలరింగ్‌లో, యువకుల కు సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్‌లో శిక్షణ త్వరలో మొదలవుతుందని వెల్లడించారు. టైలరింగ్‌ శిక్షణకు ఈనెల 30వరకు, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్‌ కోర్సు కోసం జూలై 7వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ఉచితంగా వస తి, భోజనం సమకూర్చడమే కాక యూనిఫామ్‌, టూల్‌కిట్స్‌ అందిస్తామని తెలిపారు.

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఖమ్మం సహకారనగర్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ జకీరుల్లా తెలిపారు. పాలిసెల్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో తొలిరోజు 286 మంది స్లాట్‌ బుక్‌ చేసుకోగా, 240మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్‌ 29వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

టీఎన్జీవోస్‌ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు స్థానం

రాష్ట్ర కార్యదర్శులుగా బాలకృష్ణ, జైపాల్‌

ఖమ్మం సహకారనగర్‌: టీఎన్జీవోస్‌ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నాయకులకు చోటు దక్కింది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన టీఎన్జీవోస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లాకు చెందిన గంగవరపు బాలకృష్ణ, జెడ్‌ఎస్‌.జైపాల్‌ను రాష్ట్ర కార్యదర్శులుగా ఎంపిక చేశారని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించడపై కేంద్ర అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్‌, ముజీబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్‌, యర్రా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ విద్యార్థి ప్రమాణాలు మెరుగుపడాలి

రఘునాథపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థి విద్యాప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలోని ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆమె మాట్లాడారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, వారిని అందరితో సమానంగా నిలబెట్టేలా బోధనా పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని తెలిపారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా బోధించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పాఠ్యాంశాల బోధనతో పాటు మానవీయ విలువలు, ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా నేర్పాలని అదనపు సూచించారు.

జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు
1
1/2

జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు

జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు
2
2/2

జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement