
మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యం
ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాలు లేని మెరుగైన సమాజాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ప్రజలు పాలుపంచుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు.అంతర్జాతీయ మాదక ద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న మాదక ద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహకరించాలని కోరారు. యువతీ, యువకులు కూడా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై ఉజ్వల భవిష్యత్ను కోల్పోవద్దని సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ సరదా కోసం మొదలయ్యే దురలవాట్లు ఆ తర్వాత జీవితాన్ని అంధకారంలోకి నెడతాయని తెలిపారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువు,భవిష్యతపైనే దృష్టి సారించాలని సూచించారు. ఈ ర్యాలీలో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి, డాక్టర్ నితీష్, సీఐలు భానుప్రకాష్, కరుణాకర్, స్వామి, సత్యనారాయణతో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీలో సీపీ, అదనపు కలెక్టర్