
‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్లో జిల్లా విద్యార్థులు పలువురు సత్తా చాటారు. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తిచేశాక నీట్ రాయగా, జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు అభినందించాక వివరాలు వెల్లడించాయి. – ఖమ్మం సహకారనగర్
● డాక్టర్స్ అకాడమీ ర్యాంకుల పంట
ఖమ్మంసహకారనగర్: నీట్ ఫలితాల్లో ఖమ్మంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థిని తూము వెన్నెల 626 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 307వ ర్యాంకు సాధించిందని యాజమాన్యం రాయల సతీష్బాబు, ఈగా భరణికుమార్ తెలిపారు. అలాగే, వెన్నెల రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. ద్వితీయస్థానంలో రిషిక శర్మ 588, ప్రియాంక ఎస్టీ కేటగిరిలో ఆలిండియా 171వ ర్యాంకు సాధించిందని వివరించారు. ఇంకా అతియా తరణమ్ 509, ఏ.వర్ష 505, కె.మోక్షిత శరణ్నయ 496, షేక్ సమీనమథార్ 496, రేణుశ్రీ 489, యశ్వంత్ 482, ఆయేషా సమీర 481, సీహెచ్.క్షేత్ర 474, వెన్నెలరెడ్డి 467, కే.వీ.నిక్షిత 463 మార్కులు సాధించారని, నర్ల్కులు సాధించినట్లు తెలిపారు. ఇక జి.అనూష 461, షేక్ నూరెవసీమ్ 467, టి.వైష్ణవి 451, ఎండి.సునైనా 450, ఎస్.విగ్నేష్రెడ్డి 444, బి.అక్షయ 443 ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఘనంగా సన్మానించారు. 500 మార్కులకు పైన ఆరుగురు, 450 మార్కులకు పైన 21మంది, 400 మార్కులకుపైన 62మంది, 122 మందికి ప్రభుత్వ ఎబీబీఎస్సీట్లు సాధిస్తున్న ఏకై క సంస్థ తమదేనన్నారు.
ఖమ్మం సహకారనగర్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ర్యాంక్లు సాధించిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించాక మాట్లాడారు. పి.సంహిత 951వ ర్యాంక్ సాధించగా, ఎల్.సాయిచరణ్ 1,114, బి.గోపిచంద్ 1,187, ఎం.ఆకాంక్ష 1,197, ఎం.వైష్ణవి 1,535, బి.సాయిశృతి 2,571, టి.దివ్య 2,991, బి.చైతన్య సాయి 3,058, బి.అక్షిత 4,281, ఆర్.శీతల్ 5,553, జె.వివేక్ 5,672, బి.యశ్వంత్ 5,743వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. అలాగే, ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
● హార్వెస్ట్కు ఉన్నత శ్రేణి ఫలితాలు
ఎన్టీఏ ఆధ్వర్యాన నిర్వహించిన నీట్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని హార్వెస్ట్ గ్రూప్ విద్యాసంస్థల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కళాశాల విద్యార్థిని తమన్నా డీవీఎస్ఎస్.నయనాంజలి 564 మార్కులతో 3,321, జి.రాణి ఉమాఅలేఖ్య 544 మార్కులతో 6,586వ ర్యాంకు, బి.భార్గవి 449 మార్కులతో 1,181వ ర్యాంకు సాధించగా, జి.శ్రీమయి 456 మార్కులతో 6,727, ఎండీ.అన్షియ ముస్కాన్ 487 మార్కులతో 8,420, సరోజ్రాజ్ పురోహిత్ 472 మార్కులతో 40,997, ఎం.డీ.షయాన్ మునీబ్ 433 మార్కులతో 77,202, ఎస్.జాహ్నవి 377మార్కులతో 2,55,757వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి విద్యార్థులను అభినందించారు.
న్యూవిజన్కు అత్యుత్తమ ర్యాంక్లు
సర్జన్గా సేవలందిస్తా...
భవిష్యత్లో మంచి సర్జన్గా పేదలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. నీట్లో 626 మార్కులతో ఆలిండియా స్థాయిలో 307వ ర్యాంక్ సాధించా. డాక్టర్స్ మెడికల్ అకాడమీ యజమాన్యం రాయల సతీష్బాబు, భరణికుమార్ సలహాలు, సూచనలతో ఇది సాధ్యమైంది. మా అమ్మ నవ్య గృహిణి కాగా, నాన్న తూము రామకృష్ణ న్యూలైఫ్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.
– తూము వెన్నెల, 307వ ర్యాంకు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ

‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా

‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా

‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా

‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా

‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా