
ఉత్పత్తిలో సింహభాగం సత్తుపల్లిదే..
సత్తుపల్లి: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి వ్యాప్తంగా సత్తుపల్లి సింహభాగాన నిలుస్తోందని సంస్థ సీఎండీ బలరాంనాయక్ వెల్లడించారు. ఇందుకు శ్రమించిన కార్మికులు మొదలు అధికారుల వరకు అభినందనీయులని తెలిపారు. సత్తుపల్లి మండలం జేవీఆర్ ఓసీ ఆవరణలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సత్తుపల్లి ఓసీల ద్వారా గతేడాది కంటే 6లక్షల టన్నులు అధికంగా 144.55 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, 162.23 లక్షల టన్నులు రవాణా చేశామని తెలిపారు. మార్చి 28వ తేదీన 80,931లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు సృష్టించడం విశేషమన్నారు. కాగా, సత్తుపల్లి జీఎం కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని సీఎండీ వెల్లడించారు.
గ్లోబల్గా సంస్థగా...
కొత్తగూడెం వీకే ఓసీ, ఇల్లెందు రొంపెడు ఓసీలకు అనుమతులు వచ్చాయని వెల్లడించిన సీఎండీ... త్వరలోనే ఆయా గనుల్లో ఉత్పత్తి మొదలుపెడతామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో పది మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఒప్పందం కుదిరిందని చెప్పారు. రాజస్తాన్లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని, ఆస్ట్రేలియాలోనూ బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు ఉన్నందున సింగరేణి గ్లోబల్గా సంస్థగా అవతరిస్తుందని తెలిపారు. అలాగే, బొగ్గు నాణ్యత విషయంలో గతంలో ఫిర్యాదులు వచ్చేవని.. ఇప్పుడు అవి తగ్గాయని వివరించారు.
సీఎండీని కలిసిన సైలోబంకర్ బాధితులు
కిష్టారం అంబేద్కర్ కాలనీకి చెందిన సైలో బంకర్ బాధితులు సింగరేణి సీఎండీ బలరాంనాయక్ను కలిసి వారి సమస్యలు వివరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ద్వారా మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని..త్వరలో ఒక పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, జీఎం షాలెంరాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏసీపీ ఎ.రఘు, అధికారులు పాల్గొన్నారు.
గత ఏడాదితో కంటే
మెరుగైన ఉత్పత్తి, రవాణా
సీఎండీ బలరాంనాయక్