
●వరుస విజయాల రత్నేశ్వరనాయుడు
కామేపల్లి: గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల చిన్నకుమారుడు రత్నేశ్వరనాయుడు గ్రూప్1లో రాష్ట్రస్థాయిలో 277వ ర్యాంక్, జోనల్స్థాయిలో 120వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్స్ ఫలితాల్లో గ్రూప్–1, 2, 3, 4 ఫలితాల్లో సత్తాచాటాడు. తమ తండ్రి స్థాపించిన పాఠశాలలోనే తన సోదరుడు సాయికృష్ణమనాయుడుతో కలిసి రత్నేశ్వరనాయుడు 1 నుంచి 7వ తరగతి వరకు చదివాడు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్ సి.వి.రామన్, డిగ్రీ శ్రీచైతన్య హైదరాబాద్లో చదివాడు. ప్రసుత్తం రత్నేశ్వరనాయుడు ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు.